లక్ష్మీస్ ఎన్టీఆర్ పై సంచలన ప్రకటన చేసిన:ఆర్.జి.వి
- March 16, 2018రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు.. ఇక బయోపిక్ లను తనదైన శైలిలో తెరకెక్కిస్తాడు.. తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ అంటూ ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసి సంచలనం సృష్టించాడు.
దానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే పేరు పెట్టాడు.. ఆ సినిమాను వైసీపీ నేత రాకేశ్ రెడ్డి నిర్మిస్తాడు అని కూడా ప్రకటించాడు. తాజాగా వర్మ అసహనం వ్యక్తం చేస్తూ..ఆయనతో సినిమా తీయడం లేదు అని సంచలన ప్రకట చేశారు. ఈ విషయం తెలియజేస్తూ.. ఓ వీడియో లింక్ ను కూడా ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు వర్మ.. రాకేశ్ రెడ్డి చెప్పినవన్నీ అబద్దలు అని.. ఈ అబద్ధాలు ఎవర్ని మోసం చెయ్యడానికి అనేది ఆయనకే తెలియాలి అని.. ఇక నుంచి ఆయనకు నాకు ఏ విధమైన సంబంధం లేదని ఈ నోట్ రిలీజ్ చేస్తున్నట్లు వర్మ ప్రకటించారు. అంతేకాదు. తను నాగార్జున తో చేస్తున్న ఆఫీసర్ సినిమా తర్వాత లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం 2018 ఏప్రిల్ లో మొదలు పెట్టి.. సెప్టెంబర్ నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొని రానున్నట్లు చెప్పాడు. మరి ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ కు నిర్మాత నటులు ఎవరో వర్మ ప్రకటించాల్సి ఉంది.
తాజా వార్తలు
- రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
- ఎయిరిండియా సిబ్బంది మూకుమ్మడిగా సెలవు..
- జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్దొద్దు: కోర్టును కోరిన సీబీఐ
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు మంచి రోజులు..!
- జహ్రా గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- దుబాయ్లో కొత్త ట్రాఫిక్ ప్లాన్ కు ఆమోదం
- క్యాబిన్ క్రూ సంక్షోభం.. తగ్గనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు..!
- షేక్ హజ్జా బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ మృతికి సంతాపం తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!