ఫిలిం ఛాంబర్ దగ్గర ఉద్రిక్తత..పవన్ నిరసన
- April 19, 2018
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ కు చేరుకున్నారు. తనపై వస్తున్న అభియోగాల ఫై ఫిలిం ఛాంబర్ ఏమి చేస్తుంది..అసలు మెగా ఫ్యామిలీ హీరోలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేదానిపై మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ వచ్చినట్లు తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ తో పాటు అల్లు అర్జున్ , నాగ బాబు ప్రస్తుతం ఫిలిం ఛాంబర్ లో కూర్చున్నారు. అలాగే మిగతా మెగా హీరోలతో పాటు అల్లు అరవింద్ కూడా ఛాంబర్ కు వస్తున్నట్లు సమాచారం. తనపై జరుగుతున్న కుట్ర కు పవన్ ఫిలిం ఛాంబర్ దగ్గర నిరసన తెలుపబోతున్నాడని , అందుకే నల్ల దుస్తులతో పవన్ వచ్చారని అంటున్నారు. ఇక పవన్ అక్కడికి చేరుకున్నాడని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున ఛాంబర్ కు వస్తుండడంతో అక్కడ చాల ఉద్రిక్తత నెలకొని ఉంది. మరికొద్ది సేపట్లో మీడియా తో పవన్ మాట్లాడే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్
- ఈద్ అల్ అధా సందర్భంగా 104 మంది ఖైదీలకు ఫుజైరా రూలర్ క్షమాభిక్ష
- బాలికపై అత్యాచార కేసు ప్రెస్ మీట్లో నవ్విన అధికారులపై సీఎం విజయ్ సస్పెన్షన్ వేటు!
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు
- దేశ ఆర్థిక వ్యవస్థ పై నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ!
- తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం...
- బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్రకు పద్మవిభూషణ్









