అబుదాబీ:22 మంది డ్రగ్ పెడ్లర్స్ అరెస్ట్
- April 24, 2018అబుదాబీ:అబుదాబీలో 22 మంది ఆసియా జాతీయుల్ని డ్రగ్స్ పెడ్లింగ్ కేసులో అత్యంత చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు 20 కిలోల నార్కోటిక్స్ని స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్, క్రిస్టల్ డ్రగ్స్ వారి వద్ద లభించినట్లు అధికారులు తెలిపారు. ఈ డ్రగ్స్ రాకెట్కి సంబంధించిన సూత్రధారిని కూడా గుర్తించారు. ఆసియాకి చెందినవారిగా నిందితుల్ని పేర్కొన్నారు అధికారులు. డైరెక్టరేట్ ఆఫ్ డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ కల్నల్ తాహెర్ ఘరీబ్ అల్ దహెరి మాట్లాడుతూ, సీక్రెట్ ఆపరేషన్ ద్వారా నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. గ్రూపులుగా విడిపోయి, డ్రగ్స్ని విక్రయిస్తున్నట్లు గుర్తించి, పక్కా ప్లాన్తో వారిని అరెస్ట్ చేశామన్నారు. డ్రగ్స్ పట్ల అవగాహనా కార్యక్రమాల్ని మరింత విస్తృతంగా చేపట్టాల్సి వుందని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..