సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్న అందాల భామ
- April 25, 2018
అగ్రహీరోలతో నటించటమేకాదు..తమకంటు ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుని వివాహానంతరం కొంతమంది..వేరే కారణాలతో మరికొంతమంది సినిమా పరిశ్రమకు దూరమైన అనంతరం కొంత విరామం తరువాత మళ్లీ సినిమాలలోకి రావటం మామూలే. కొంతమంది రీ ఎంట్రీతో మళ్లీ సక్సెస్ బాటలో వుంటే ఇంకొందరు వచ్చిన పాత్రలతో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో మరో స్టార్ హీరోయిన్ రీఎంట్రీ ఇస్తానంటే సంకేతాలు ఇస్తోంది.
తెలుగు తెరకి నాజూకు సౌందర్యాన్ని పరిచయం చేసిన నిన్నటి తరం కథానాయికలలో అంజలా జవేరి ఒకరు. చిరంజీవి .. బాలకృష్ణ .. వెంకటేశ్ ల సరసన కథానాయికగా చేసిన ఆమె .. చక్కటి విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తరువాత వివాహం చేసుకున్న అంజలా జవేరీ సినిమాలకు దూరం వున్నారు. విరామం అనంతరం ఆమె తెలుగులో రీ ఎంట్రీ ఇస్తానని అంటున్నారు.
తెలుగులో నిన్నటి తరం కథానాయికలుగా ఒక వెలుగు వెలిగిన నదియా .. భూమిక .. సిమ్రాన్ .. ఖుష్బూ .. మీనా రీ ఎంట్రీ ఇచ్చారు. భారీ పారితోషికాన్ని అందుకోవడంతో పాటు, మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంటున్నారు. మరి వారిని చూసి స్ఫూర్తిని పొందిందో ఏమో తెలియదు గానీ, మంచి కథతో .. అవార్డులు తెచ్చిపెట్టే పాత్రలతో వస్తే చేయడానికి తాను సిద్ధంగా వున్నానని అంజలా జవేరి చెప్పుకొచ్చారు. వెంకటేశ్,చిరంజీవి వంటి అగ్రహీరోలతో చేసిన మంచి నటిగా పేరు తెచ్చుకున్న అంజలా జవేరీ రీ ఎంట్రీ ఎలా వుండనుందో వేచి చూడాలి.
తాజా వార్తలు
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్
- ఈద్ అల్ అధా సందర్భంగా 104 మంది ఖైదీలకు ఫుజైరా రూలర్ క్షమాభిక్ష
- బాలికపై అత్యాచార కేసు ప్రెస్ మీట్లో నవ్విన అధికారులపై సీఎం విజయ్ సస్పెన్షన్ వేటు!
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు
- దేశ ఆర్థిక వ్యవస్థ పై నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ!
- తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం...
- బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్రకు పద్మవిభూషణ్









