తగ్గిన బంగారం ధర...
- April 27, 2018దిల్లీ:పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో ఇటీవల బంగారం ధర బాగా పెరిగింది. కాగా అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో నేటి బులియన్ మార్కెట్లో పసిడి ధర పడిపోయింది. స్థానిక నగల వ్యాపారుల నుంచి కూడా డిమాండ్ తగ్గినట్లు మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. నేడు పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ.190 తగ్గి రూ.32,210గా ఉంది. వెండి కూడా ఇదే బాటలో పయనించింది. కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.40,450గా ఉంది. పారిశ్రామిక అవసరాలకు, నాణేల తయారీకి కూడా డిమాండ్ తగ్గినట్లు తెలుస్తోంది. రూపాయి మారం విలువ బలహీన పడి డాలరు విలువ పెరగడం కూడా ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.48శాతం తగ్గి 1316.30డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 0.27శాతం తగ్గి 16.47 డాలర్లుగా ఉంది.
తాజా వార్తలు
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ