హమస్ పోస్ట్పై ఇజ్రాయిల్ క్షిపణుల దాడి
- April 28, 2018ఇజ్రాయిల్ సైన్యం హమస్ పోస్ట్పై శుక్రవారం రాత్రి రెండు క్షిపణులను ప్రయోగించింది. పశ్చిమ గాజా నగరంలో జాలర్ల హార్బర్కు సమీపంలో గల హమస్ స్థావరంపై జరిగిన ఈ దాడిలో భవనం, రెండు సైనిక వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై ఇజ్రాయిల్ సైన్యం కూడా వెంటనే స్పందించలేదు. మార్చి 30వ తేది నుండి ఇజ్రాయిల్, పాలస్తీనియన్ల మధ్య ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యంలో గాజా నగరంలో ఈ దాడులు చోటు చేసుకున్నాయి. ప్రతి రోజూ వేలాదిమంది పాలస్తీనియన్లు ఇజ్రాయిల్ వ్యతిరేక ర్యాలీల్లో పాల్గొంటున్నారు. తూర్పు గాజాలో శుక్రవారం వందలాదిమంది పాలస్తీనియన్లు, ఇజ్రాయిల్ సైనికుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో ముగ్గురు పాలస్తీనియన్లు మరణించగా, 800మందికి పైగా గాయపడ్డారు.
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ