హమస్ పోస్ట్పై ఇజ్రాయిల్ క్షిపణుల దాడి
- April 28, 2018
ఇజ్రాయిల్ సైన్యం హమస్ పోస్ట్పై శుక్రవారం రాత్రి రెండు క్షిపణులను ప్రయోగించింది. పశ్చిమ గాజా నగరంలో జాలర్ల హార్బర్కు సమీపంలో గల హమస్ స్థావరంపై జరిగిన ఈ దాడిలో భవనం, రెండు సైనిక వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై ఇజ్రాయిల్ సైన్యం కూడా వెంటనే స్పందించలేదు. మార్చి 30వ తేది నుండి ఇజ్రాయిల్, పాలస్తీనియన్ల మధ్య ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యంలో గాజా నగరంలో ఈ దాడులు చోటు చేసుకున్నాయి. ప్రతి రోజూ వేలాదిమంది పాలస్తీనియన్లు ఇజ్రాయిల్ వ్యతిరేక ర్యాలీల్లో పాల్గొంటున్నారు. తూర్పు గాజాలో శుక్రవారం వందలాదిమంది పాలస్తీనియన్లు, ఇజ్రాయిల్ సైనికుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో ముగ్గురు పాలస్తీనియన్లు మరణించగా, 800మందికి పైగా గాయపడ్డారు.
తాజా వార్తలు
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్
- ఈద్ అల్ అధా సందర్భంగా 104 మంది ఖైదీలకు ఫుజైరా రూలర్ క్షమాభిక్ష
- బాలికపై అత్యాచార కేసు ప్రెస్ మీట్లో నవ్విన అధికారులపై సీఎం విజయ్ సస్పెన్షన్ వేటు!
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు
- దేశ ఆర్థిక వ్యవస్థ పై నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ!
- తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం...
- బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్రకు పద్మవిభూషణ్









