'రెడ్' యాపిల్
- April 29, 2018
ప్రఖ్యాత మొబైల్ తయారీ సంస్థ యాపిల్ తాజాగా ఐ ఫోన్ 8 ప్లస్ ను మార్కెట్ లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ సారి వచ్చిన ఈ మొబైల్ ఎన్నడూ లేని విధంగా రెడ్ కలర్ లో దర్శనమిస్తోంది. దీని వెనకాల ప్రత్యేక కారణం ఉందండోయ్ అదేంటంటే..రెడ్ అనే సంస్థతోయాపిల్ కు దాదాపు 11 ఏళ్ల సంబంధం ఉంది. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే..ఆఫ్రికా దేశంలోని ఎయిడ్స్ / హెచ్ఐవి భాదితులలో తల్లి నుండి బిడ్డకు సంక్రమించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, కౌన్సెలింగ్ ను, మెడిసిన్ ను అందిస్తుంటారు.
ఇక తాజాగా రెడ్ సంస్థకు..యాపిల్ సంస్థ 160 మిలియన్ డాలర్లను విరాళంగా ఇవ్వడానికి నడుం బిగించి..ఈ రెడ్ కలర్ లో ఐ ఫోన్ 8 ప్లస్ ఫోన్ ను తయారు చేసింది. ఈ ఫోన్ ధర మన ఇండియాలో రూ. 67,940 ఉండనుంది. ఇలా రెడ్ కలర్ ఉన్న ఏ యాపిల్ వస్తువు కొన్నా ఆ మొత్తాన్ని రెడ్ సంస్థకు విరాళంగా వెళ్లనుంది. తద్వారా ఎయిడ్స్ లేని సమాజాన్ని నిర్మించడంలో ఈ ఫోన్స్ కొన్నవారు భాగస్వామ్యం కానున్నారు.
మరోవైపు ఈ రెడ్ ఫోన్ రెండు వెర్షన్స్ గా రానుంది. ఒకటి 64 జీబీ కాగా మరొకరి 256 జీబీ లతో అందుబాటులోకి తెచ్చారు.
తాజా వార్తలు
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్
- ఈద్ అల్ అధా సందర్భంగా 104 మంది ఖైదీలకు ఫుజైరా రూలర్ క్షమాభిక్ష
- బాలికపై అత్యాచార కేసు ప్రెస్ మీట్లో నవ్విన అధికారులపై సీఎం విజయ్ సస్పెన్షన్ వేటు!
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు
- దేశ ఆర్థిక వ్యవస్థ పై నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ!
- తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం...
- బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్రకు పద్మవిభూషణ్









