'రెడ్' యాపిల్
- April 29, 2018
ప్రఖ్యాత మొబైల్ తయారీ సంస్థ యాపిల్ తాజాగా ఐ ఫోన్ 8 ప్లస్ ను మార్కెట్ లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ సారి వచ్చిన ఈ మొబైల్ ఎన్నడూ లేని విధంగా రెడ్ కలర్ లో దర్శనమిస్తోంది. దీని వెనకాల ప్రత్యేక కారణం ఉందండోయ్ అదేంటంటే..రెడ్ అనే సంస్థతోయాపిల్ కు దాదాపు 11 ఏళ్ల సంబంధం ఉంది. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే..ఆఫ్రికా దేశంలోని ఎయిడ్స్ / హెచ్ఐవి భాదితులలో తల్లి నుండి బిడ్డకు సంక్రమించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, కౌన్సెలింగ్ ను, మెడిసిన్ ను అందిస్తుంటారు.
ఇక తాజాగా రెడ్ సంస్థకు..యాపిల్ సంస్థ 160 మిలియన్ డాలర్లను విరాళంగా ఇవ్వడానికి నడుం బిగించి..ఈ రెడ్ కలర్ లో ఐ ఫోన్ 8 ప్లస్ ఫోన్ ను తయారు చేసింది. ఈ ఫోన్ ధర మన ఇండియాలో రూ. 67,940 ఉండనుంది. ఇలా రెడ్ కలర్ ఉన్న ఏ యాపిల్ వస్తువు కొన్నా ఆ మొత్తాన్ని రెడ్ సంస్థకు విరాళంగా వెళ్లనుంది. తద్వారా ఎయిడ్స్ లేని సమాజాన్ని నిర్మించడంలో ఈ ఫోన్స్ కొన్నవారు భాగస్వామ్యం కానున్నారు.
మరోవైపు ఈ రెడ్ ఫోన్ రెండు వెర్షన్స్ గా రానుంది. ఒకటి 64 జీబీ కాగా మరొకరి 256 జీబీ లతో అందుబాటులోకి తెచ్చారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









