ఇరాక్ కాల్పుల్లో 16 మంది మృతి..
- May 01, 2018ఆయుధాలతో వచ్చిన ఓ వ్యక్తి కాల్పులు జరపడంతో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఇరాక్లోని సలాహుద్దీన్ ప్రావిన్స్లో నిన్న సాయంత్రం జరిగింది. బాగ్దాద్ నగరానికి సమీపంలో ఉన్న దుజైల్ పట్టణంలోని ఓ గ్రామంలో ఆయుధాలతో వచ్చిన వ్యక్తి.. మూడు ఇళ్లను టార్గెట్గా చేసుకుని విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. కాల్పులు జరిగిన మూడు ఇళ్లు రహిమ్ అల్ మర్జౌక్ అనే న్యాయమూర్తి ముగ్గురు కుమారుల ఇళ్లుగా గుర్తించారు అధికారులు. చనిపోయిన వారంతా రహిమ్ అల్ మర్జౌక్ కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. అయితే మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్న పిల్లలే ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన భద్రతా బలగాలు దర్యాప్తు ప్రారంభించాయి. నిందితుడు పరారీలో ఉండటంతో.. గాలింపు చర్యలు చేపట్టిన్నట్లు కల్నల్ మహమ్మద్ అల్ జుబౌరీ తెలిపారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు