వేగంతో వీస్తున్న గాలులు.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. భయాందోళనలో జనం..
- May 02, 2018అండమాన్ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే మహారాష్ట్ర నుంచి కర్నాటక మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి, రాజస్థాన్ నుంచి పశ్చిమ బెంగాల్ మీదుగా మణిపూర్ వరకు మరో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. వీటన్నంటి ప్రభావంతో కోస్తాంధ్రలో చాలాచోట్ల విస్తారంగా వర్షాలు పడ్తున్నాయి. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వేటకెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పార్వతీపురంలో గంటకు పైగా కుండపోతగా వర్షం పడింది. దీంతో రోడ్లు చెరువులను తలపించాయి. పిడుగులు పడడంతో జనం తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. గజపతినగరం, మెంటాడ, బొండపల్లి, దత్తిరాజేరు మండలాల్లో ఏకధాటిగా వర్షం పడింది. ఏజేన్సీ ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్