రమదాన్: పిలిగ్రిమ్స్ కోసం ఎమర్జన్సీ టీమ్స్
- May 10, 2018మక్కా: అత్యవసర పరిస్థితుల్లో ఉమ్రా పిలిగ్రిమ్స్ అలాగే విజిటర్స్కి గ్రాండ్ మాస్క్ వద్ద సేవలందించేందుకోసం రమదాన్ పవిత్ర మాసంలో ప్రత్యేకంగా టీమ్స్ ఏర్పాటు చేశారు. మక్కా డిప్యూటీ ఎమిర్, ప్రిన్స్ అబ్దుల్లా బిన్ బందర్ ఈ మేరకు ఓ డైరెక్టివ్ని విడుదల చేశారు. అబ్దుల్లా బిన్ బందర్, సెంట్రల్ హజ్ కమిటీకి డిప్యూటీ ఛైర్మన్గా వ్యవహరిస్తున్న సంగతి తెల్సిందే. ప్రిన్స్ అబ్దుల్లా, గ్రాండ్ మాస్క్ని సందర్శించి, అక్కడ ఏర్పాట్లను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. సెక్యూరిటీ ఫోర్సెస్ని అడిగి సమాచారాన్ని సేకరించిన ప్రిన్స్, భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని వారికి సూచించారు. రమదాన్ సందర్భంగా పెద్దయెత్తున యాత్రీకులు గ్రాండ్ మాస్క్కి వచ్చే అవకాశం వున్నందున, ఎలాంటి అనుకోని ఘటనలకూ తావివ్వకూడదని ఆదేశించారు ప్రిన్స్.
తాజా వార్తలు
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు