హైదరాబాద్:ప్రముఖ నటుడి వస్త్ర దుకాణంలో చోరీ
- May 19, 2018సినీ నటుడు ఉత్తేజ్ నిర్వహిస్తున్న వస్త్ర దుకాణంలో చోరీ జరిగింది. ముగ్గురు మహిళలు దృష్టి మరల్చి ఖరీదైన మూడు చీరలను తీసుకొని పారిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నటుడు ఉత్తేజ్కు ఎల్లారెడ్డిగూడలో అలంకార్ డిజైనర్స్ పేరుతో వస్ర్తాల దుకాణం ఉంది. దీన్ని ఆయన సతీమణి పద్మావతి నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం ముగ్గురు మహిళలు షాపులోకి వచ్చారు. చీరలను చూస్తునట్టు నటించి, పద్మావతి దృష్టి మరల్చి మూడు చీరలను తీసుకొని పారిపోయారు. వీటి విలువ సుమారు రూ.80 వేలు ఉంటుందని ఉత్తేజ్ సంజీవరెడ్డినగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..