నాని, నాగ్ల మల్టీ స్టారర్ విడుదలకు సిద్ధం
- May 19, 2018నాని, నాగ్ కాంబినేషన్లో క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రం కోసం స్పెషల్గా వేసిన కాలనీ సెట్లో ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నట్టు తెలుస్తుంది. నాని సరసన ఛలో ఫేం రష్మిక మందాన, నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. సంపూర్ణేష్ బాబు కూడా చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మెట్రో ట్రైన్లో షూటింగ్ జరుపుకున్న తొలి చిత్రం ఇదే కాగా, ఈ మూవీ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతుందని తెలుస్తుంది. ఇందులో నాగార్జున డాన్గా కనిపిస్తే, నాని డాక్టర్ పాత్ర పోషిస్తున్నాడని అంటున్నారు. అయితే ఈ చిత్రం వినాయక చివితి శుభాకాంక్షలతో సెప్టెంబర్ 13న గ్రాండ్గా విడుదల కానుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నాని నటించిన కృష్ణార్జున యుద్ధం ఇటీవల ప్రేక్షకుల ముందుకు రాగా, నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆఫీసర్ విడుదల కావలసి ఉంది.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన