మరో చిత్రానికి హీరో ధనుష్ దర్శకత్వం
- May 23, 2018'పవర్పాండి' చిత్రంతో దర్శకుడిగా ఆరంగేట్రం చేసిన కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మరోసారి మెగా ఫోన్ పట్టబోతున్నారు. సీనియర్ నటుడు రాజ్కిరణ్తో ధనుష్ చేసిన 'పవర్పాండి' కమర్షియల్ సక్సెస్తో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది. దాంతో, ఆ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో రీమేక్ చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. అదే సమయంలో 'పవర్ పాండి'కి సీక్వెల్ తీయబోతున్నట్టు ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, హాలీవుడ్ చిత్రంలో ధనుష్ బిజీ అవడంతో పాటు ఇతర ప్రాజెక్టుల్లో నటిస్తుండడం వల్ల మెగాఫోన్కు దూరంగా ఉన్నారు. ఈ నేపధ్యంలో ధనుష్ మరోసారి దర్శకత్వం వహించేందుకు సన్నా హాలు చేపట్టినట్టు కోలీవుడ్ టాక్. వచ్చే నెలలోనే ఆ సినిమా ప్రారం భమయ్యే అవకాశముందని చెప్పు కుంటున్నారు. అయితే, వేరే ఆ సినిమాలో వేరే హీరో నటిస్తారా లేక ధనుష్ నటిస్తారా అన్నది ఇంకా తెలియలేదు. కాగా, ధనుష్ నటించిన హాలీవుడ్ చిత్రం 'ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్' జూలైలో తెరపైకి రానుంది.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..