దుబాయ్:మాస్టర్స్ కబడ్డీ టోర్నీ లో పాక్పై భారత్ ఘన విజయం
- June 22, 2018దుబాయ్:టోర్నీ ఏదైనా సరే, ప్రత్యర్థి జట్టు ఎవరైనా ఆధిపత్యం మాత్రం మాదేనని అంటోంది భారత కబడ్డీ జట్టు.దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో శుక్రవారం జరిగిన కబడ్డీ మాస్టర్స్ టోర్నీ తొలి మ్యాచ్లో భారత్ శుభారంభం చేసింది.
ఈ టోర్నీలో ఫేవరేట్గా బరిలోకి దిగిన భారత్ 36-20 తేడాతో పాకిస్థాన్పై ఘన విజయం సాధించింది. అజయ్ ఠాకూర్ సారథ్యంలో భారత ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడారు. ఈ పోరు ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన భారత్... తొలి అర్ధభాగం ముగిసే సరికి 22-9తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది.
అనంతరం ప్రారంభమైన రెండో అర్ధభాగంలో భారత ఆటగాళ్లు తమ జోరు కొనసాగించి మొత్తం మీద 36-20 పాయింట్ల తేడాతో పాకిస్థాన్పై టోర్నీ తొలి మ్యాచ్లోనే ఘన విజయం నమోదు చేసి తమ సత్తా చాటారు. కెప్టెన్ అజయ్ ఠాకూర్ 15 రైడ్ పాయింట్లతో చెలరేగి ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు.
టోర్నీలో భాగంగా భారత్ తమ తదుపరి మ్యాచ్లో శనివారం కెన్యాతో తలపడనుంది. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో పాక్, కెన్యాలతో కలిసి భారత్ గ్రూప్-ఎలో ఉంది. గ్రూప్-బిలో ఇరాన్, కొరియా, అర్జెంటీనా ఉన్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి