ఒకే ఇంట్లో11 మంది ఆత్మహత్య కేసులో తీవ్రంగా భయపడుతున్న పోలీసులు..
- July 10, 2018దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒకే ఇంట్లో 11 మంది ఆత్మహత్య కేసులో రోజు రోజుకు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ రోజు వారందరు హత్యగావించారనే రూమర్లు రాగా మరోక రోజు వారు మోక్షం కోసం ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికి ఈ విషయం తేల్చేందుకు పోలీసులు బుర్రబద్దలు కొట్టుకుంటున్నారు. ఎవరో ఒకరిద్దరికి మాత్రమే మోక్షంపై ప్రీతీ ఉన్నప్పుడు వారు మాత్రమే చనిపోవాలి.. అలాంటప్పుడు అందర్నీ ఎందుకు చంపినట్టు, పైగా కుటుంబంలో అందరికి ఒకే అభిప్రాయం ఉండటం సాధ్యమేనా అనే కోణంలో కూడా పోలీసుల విచారిస్తున్నారు. ఇదిలావుంటే ఈ కేసును విచారిస్తున్న పోలీసుల్లో చాలామంది తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మునుపెన్నడు తమ జీవితంలో ఇలాంటి సంఘటనను ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. ఈ కేసు విచారణ పనిలో పడి చాలా మంది నిద్రలేని రాత్రులు కూడా గడుపుతున్నారు. విచారణ నిమిత్తం పోలీసులు తరచుగా బాటియా ఇంటికి వెళ్తుండటం.. పైగా ఇంటిని చూస్తే ఏదో కీడు జరుగుతుందున్న భయం వారిలో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో వారు ఒత్తిడికి లోనవుతున్న మాట వాస్తవమే అని కొందరు పోలీసులు అంగీకరిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ