ట్విట్టర్ షాక్ తగిలిన తారలు
- July 14, 2018ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్.. ఇలా సోషల్ మీడియాలో తమతమ అకౌంట్లకు ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో ఘనంగా చెప్పుకునే రోజులివి. సినీ స్టార్ల విషయానికొస్తే దీనికి మరింత ప్రాముఖ్యత. అయితే, ఈ విషయంలో బాలీవుడ్ స్టార్ నటీనటులకు తాజాగా పెద్ద షాకే ఇచ్చింది ట్విట్టర్ సంస్థ. ప్రముఖ నటులు అమితాబ్, షారూఖ్, ప్రియాంక చోప్ర, దీపిక పదుకునే వంటి సినీ స్టార్స్ ఫాలోవర్స్ ను భారీగా తగ్గించింది.
ఇటీవల ట్విట్టర్ సంస్థ నకిలీ అకౌంట్లపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. తప్పుడు వివరాలతో అకౌంట్ రన్ చేస్తోన్న ఖాతాదారుల్ని ఏరిపారేస్తోంది. ఇందులో భాగంగా చాలామంది ఖాతాలు గల్లంతయ్యాయి. సినీ స్టార్స్ ను ఫాలో అయ్యే ఇలాంటి నకిలీ గాళ్లంతా పోవడంతో ఆమేరకు ఆయా నటీనటుల ఫాలోవర్ల సంఖ్య తగ్గిపోయింది. ఇలా భారీగా కోతకు గురైన వాళ్లలో అమితాబ్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, మూడు లక్షల పైచిలుకు ఫాలోవర్లు కోల్పోయిన వాళ్లలో షారూఖ్, ప్రియాంకచోప్రా, దీపికా పదుకునే తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..