40 రోజులు లాక్ అయిన ప్రభాస్
- July 15, 2018బాహుబలి చిత్రం తో దేశ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..ప్రస్తుతం 'రన్ రాజా రన్' ఫెమ్ సుజీత్ దర్శకత్వంలో 'సాహో' చిత్రం లో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తుండగా , బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. గత నెల క్రితం దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ , మూడు రోజుల క్రితం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది.
ఈ షెడ్యూల్ దాదాపు 40 రోజుల పాటు జరుగనుంది. సినిమాలోని కీలక సన్నివేశాలను ఇక్కడ షూట్ చేస్తారని సమాచారం. తెలుగు , తమిళ , హిందీ భాషల్లో విడుదలకానున్న ఈ చిత్రానికి శంకర్-ఎహసాన్ -లాయ్ లు సంగీతం అందిస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- రూ.4వేల ఆసరా పెన్షన్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన
- జార్జియా: ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన 50 వేల మంది
- అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- సౌదీలో BON TUM మయోనైజ్ పై నిషేధం
- రస్ అల్ ఖైమాలో గాయపడ్డ వ్యక్తి ఎయిర్లిఫ్ట్
- మే14 వరకు ‘మ్యాంగో మానియా’ మహోత్సవం
- విదేశీయుల నియామకం..రెస్టారెంట్ యజమానికి భారీ ఫైన్
- ఒమన్ను సందర్శించిన ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్తలు
- 'నిద్రపోతున్న' టీచర్ని ఫోటో తీసినందుకు Dh2000 జరిమానా
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..