రియాద్ లో వ్యక్తి హత్య కేసు..ఐదుగురిని ఉరితీశారు
- July 17, 2018రియాద్: వేర్హౌజ్ గార్డు హత్య కేసులో దోషులను సౌదీ అరేబియా ప్రభుత్వం ఉరితీసింది. ఐదుగురిలో ఇద్దరు సౌదీ అరేబియా దేశస్థులు కాగా..ముగ్గురు చాద్ దేశస్థులున్నారు. ఐదుగురు వ్యక్తులు జెడ్డాలో పాకిస్థాన్ వేర్హౌజ్ గార్డుపై దాడి చేసి..అతని మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లారు. ఈ దాడిలో గార్డు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించి అరస్టైన ఐదుగురు దోషులను ఉరి తీశామని సౌదీ అరేబియా అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. సాదీలో సాధారణంగా ఉరిశిక్ష బహిరంగంగా అమలు చేస్తుంటారు. అయితే దోషులు ఎక్కడ, ఎప్పుడు ఈ నేరం చేశారు.. వారిని ఎక్కడ ఉరితీశారనే విషయంపై మాత్రం అధికారులు స్పష్టత ఇవ్వలేదు. 2018లో సౌదీ ప్రభుత్వం 64 మందికి ఉరిశిక్ష అమలు చేసింది. 2017లో 122 మంది, 2016లో 144 మందిని ఉరితీసింది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్