10 దిర్హామ్లకే టిక్కెట్: దుబాయ్ ఎయిర్లైన్
- July 19, 2018దుబాయ్కి చెందిన ఎయిర్ లైన్ ఫ్లై దుబాయ్, సమ్మర్ నేపథ్యంలో స్పెషల్ ఫేర్స్ని అనౌన్స్ చేసింది. దుబాయ్ నుంచి వెళ్ళేందుకుగాను కనిష్టంగా 10 దిర్హామ్ల ఖర్చుతో టిక్కెట్లను ప్రకటించింది. అయితే ఈ అతి తక్కువ ధర పిల్లలకు మాత్రమే. జులై 19 నుంచి జులై 28 వరకు ఈ ఆఫర్ అందుబాటులో వుంటుంది. ఈ సమయంలో టిక్కెట్ కొనుగోలు చేసినవారికి ఆగస్ట్ 15 వరకు ప్రయాణించే వీలుంటుంది. జార్జియా, అర్మేనియా, అజర్బైజాన్ ఇటలీ తదిత డెస్టినేషన్స్ ఇందులో వున్నాయి. జోర్డాన్, ఇరాక్, జాంజిబార్ కూడా ఈ లిస్ట్లో వున్నాయి. ఈ ఆఫర్ పొందాలంటే అడల్ట్ రిటర్న్ టిక్కెట్ని ఎకానమీలో కొనుగోలు చేయాల్సి వుంటుంది. అడల్ట్ ఫుల్ ఫేర్ చెల్లించాక, చిన్నారులకు 10 దిర్హామ్లకే టిక్కెట్ని పొందవచ్చు. పన్నులు, సర్ఛార్జిలు దీనికి అదనం. పిల్లలు 3 నుంచి 12 ఏళ్ళ వయసువారైతేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. దుబాయ్ నుంచి ఎకానమీ క్లాస్ ఫేర్స్కి మాత్రమే ఈ ఆఫర్ పరిమితం.
తాజా వార్తలు
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు