10 దిర్హామ్లకే టిక్కెట్: దుబాయ్ ఎయిర్లైన్
- July 19, 2018దుబాయ్కి చెందిన ఎయిర్ లైన్ ఫ్లై దుబాయ్, సమ్మర్ నేపథ్యంలో స్పెషల్ ఫేర్స్ని అనౌన్స్ చేసింది. దుబాయ్ నుంచి వెళ్ళేందుకుగాను కనిష్టంగా 10 దిర్హామ్ల ఖర్చుతో టిక్కెట్లను ప్రకటించింది. అయితే ఈ అతి తక్కువ ధర పిల్లలకు మాత్రమే. జులై 19 నుంచి జులై 28 వరకు ఈ ఆఫర్ అందుబాటులో వుంటుంది. ఈ సమయంలో టిక్కెట్ కొనుగోలు చేసినవారికి ఆగస్ట్ 15 వరకు ప్రయాణించే వీలుంటుంది. జార్జియా, అర్మేనియా, అజర్బైజాన్ ఇటలీ తదిత డెస్టినేషన్స్ ఇందులో వున్నాయి. జోర్డాన్, ఇరాక్, జాంజిబార్ కూడా ఈ లిస్ట్లో వున్నాయి. ఈ ఆఫర్ పొందాలంటే అడల్ట్ రిటర్న్ టిక్కెట్ని ఎకానమీలో కొనుగోలు చేయాల్సి వుంటుంది. అడల్ట్ ఫుల్ ఫేర్ చెల్లించాక, చిన్నారులకు 10 దిర్హామ్లకే టిక్కెట్ని పొందవచ్చు. పన్నులు, సర్ఛార్జిలు దీనికి అదనం. పిల్లలు 3 నుంచి 12 ఏళ్ళ వయసువారైతేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. దుబాయ్ నుంచి ఎకానమీ క్లాస్ ఫేర్స్కి మాత్రమే ఈ ఆఫర్ పరిమితం.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు