ఛత్తీస్గఢ్ గవర్నర్ బలరామ్జీ దాస్ టాండన్ కన్నుమూత
- August 14, 2018రాయ్పూర్:ఛత్తీస్గఢ్ రాష్ట్ర గవర్నర్ బలరామ్జీ దాస్ టాండన్(90) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యానికి గురైన టాండన్ను చికిత్స నిమిత్తం ఇవాళ ఉదయం రాయ్పూర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ టాండన్ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. గవర్నర్ టాండన్ మృతిపట్ల ఆ రాష్ట్ర సీఎం రమణ్సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. జనసంఘ్ స్థాపించిన సభ్యుల్లో టాండన్ కూడా ఒకరు. బీజేపీలో ఆయన కీలక పదవుల్లో పని చేశారు. పంజాబ్ కు డిప్యూటీ సీఎంగా కూడా సేవలందించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం గడిపారు. ఛత్తీస్గఢ్ గవర్నర్ గా 2014, జులైలో నియామకం అయ్యారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు