ఇండియా:స్వల్ప జోరందుకున్న రూపాయి
- August 20, 2018ముంబయి:అంతర్జాతీయ వాణిజ్య భయాలు, టర్కీ లీరా పతనంతో జీవనకాల కనిష్ఠానికి చేరుకున్న రూపాయి ఎట్టకేలకు కోలుకుంది. డాలరుతో రూపాయి విలువ సోమవారం 33 పైసలు కోలుకుని 69.82కి చేరింది. ఒక్కరోజులో ఈ స్థాయిలో రూపాయి విలువ పెరగడం ఏడు వారాల్లో ఇదే గరిష్ఠం. అంతర్జాతీయ పరిణామాలకు తోడు వాణిజ్య చర్చలు జరిపేందుకు చైనా ప్రతినిధులు అమెరికాకు వెళ్తారన్న సంకేతాలు రూపాయి బలపడడానికి కారణమయ్యాయి. దీనికి తోడు ద్రవ్యోల్బణం తగ్గడం మరో కారణం. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గత వారంలో రూపాయి విలువ భారీగా పతనమైన సంగతి తెలిసిందే. టర్కీ ప్రభావంతో జీవన కాల కనిష్ఠమైన రూ.70.40కు చేరుకుంది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..