హైదరాబాద్ లో నేడు, రేపు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
- September 14, 2018హైదరాబాద్ రైల్వేస్టేషన్లో సిగ్నలింగ్ అప్గ్రేడేషన్ పనులు జరుగుతున్నందున ఈ మార్గంలో నడిచే పలు ఎంఎంటీఎస్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ - లింగంపల్లి మధ్య నడిచే 10 సర్వీసులను శనివారం రద్దు చేయగా, ఆదివారం లింగంపల్లి-ఫలక్నుమా మధ్య నడిచే 47171 నంబరు ఎంఎంటీఎస్తోపాటు హైదరాబాద్-లింగంపల్లి మధ్య నడిచే 47100, 47101 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దుచేశారు. అదేవిధంగా హైదరాబాద్-పూర్ణ మధ్య నడిచే ప్యాసింజర్ రైలు శనివారం లింగంపల్లి నుంచి రాత్రి 10.17 గంటలకు బయల్దేరుతుందని, హైదరాబాద్-కొచువెల్లి మధ్య నడిచే స్పెషల్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాత్రి 9.40 కి బయలుదేరుతుంది. పర్బానీ- హైదరాబాద్ మధ్య నడిచే ప్యాసింజర్ రైలు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాత్రి 11.10 గంటలకు బయల్దేరనుంది.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు