లాంగ్ టెర్మ్ రెసిడెన్స్ వీసాపై హర్షం
- September 17, 2018యూఏఈలోని వలసదారులు, రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ కాలం యూఏఈలో వుండేందుకు వీలుగా యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ చేసిన ప్రకటన పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఐదేళ్ళ రెసిడెన్స్ వీసాకి సంబంధించి నిబంధనలు ఇలా వున్నాయి. 55 ఏళ్ళకు పైబడ్డవారికి ఐదేళ్ళకుగాను ప్రత్యేక పరిస్థితుల్లో వీసాని మంజూరు చేస్తారు. వలసదారుడు ఖచ్చితంగా 2 మిలియన్ దిర్హామ్ల విలువైన ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ కలిగి వుండాలి. 1 మిలియన్ లేదా అంతకు మించి సేవింగ్స్ వుండాలి. 20,000 దిర్హామ్ల కంటే ఎక్కువగా యాక్టివ్ ఆదాయం కలిగి వుండాలి. ఈ మూడింటిలో ఏది కలిగి వున్నా, వారికి ఐదేళ్ళ కాలానికి రెసిడెన్సీ వీసా దక్కుతుంది. దశాబ్దాలుగా యూఏఈలో నివసిస్తున్నవారికి ఇది ఎంతో ఉపకరిస్తుందని రాయల్ ఆర్కిడ్ గ్రూప్ ఓనర్ వినయ్ వర్మ చెప్పారు. 17 ఏళ్ళుగా తాను యూఏఈలో నివసిస్తున్నాననీ, తమకు ఈ నిర్ణయం ఎంతో ఆనందాన్నిచ్చిందని లైన్ ఇన్వెస్టిమెంట్ డైరెక్టర్, లులు గ్రూప్ ఎక్స్ప్రెసెస్ వజీబ్ అల్ ఖౌరి చెప్పారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు