దుబాయ్లో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి
- September 17, 2018దుబాయ్లోని షేక్ రషీద్ రోడ్డుపై జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురికి గాయలయ్యాయి. వాహనం టైరు పేలి, బ్యారియర్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతి చెందినవారిలో ఓ మహిళ, ఓ పురుషుడు వున్నారు. గాయపడ్డవారిలో ఐదుగురు మహిళ కాగా, ఒకరు పురుషుడు. గాయపడ్డవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఉదయం 9.32 నిమిషాల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గాయపడ్డవారికి రషీద్ హాస్పిటల్లో వైద్య చికిత్స అందుతోందని అల్ మురాకాబాద్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ అలి అహ్మద్ అబ్దుల్లా ఘానిమ్ చెప్పారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ని పాటించడంతోపాటు, రెగ్యులర్గా తమ వాహనాన్ని చెక్ చేస్తుండాలనీ, టైర్ల విషయంలో అప్రమత్తంగా వుండాలని బ్రిగేడియర్ ఘానిమ్ సూచించారు.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..