దుబాయ్లో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి
- September 17, 2018
దుబాయ్లోని షేక్ రషీద్ రోడ్డుపై జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురికి గాయలయ్యాయి. వాహనం టైరు పేలి, బ్యారియర్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతి చెందినవారిలో ఓ మహిళ, ఓ పురుషుడు వున్నారు. గాయపడ్డవారిలో ఐదుగురు మహిళ కాగా, ఒకరు పురుషుడు. గాయపడ్డవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఉదయం 9.32 నిమిషాల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గాయపడ్డవారికి రషీద్ హాస్పిటల్లో వైద్య చికిత్స అందుతోందని అల్ మురాకాబాద్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ అలి అహ్మద్ అబ్దుల్లా ఘానిమ్ చెప్పారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ని పాటించడంతోపాటు, రెగ్యులర్గా తమ వాహనాన్ని చెక్ చేస్తుండాలనీ, టైర్ల విషయంలో అప్రమత్తంగా వుండాలని బ్రిగేడియర్ ఘానిమ్ సూచించారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







