2021లో ప్రారంభం కానున్న కింగ్ హమాద్ కాజ్ వే వర్క్
- September 18, 2018కింగ్ హమాద్ కాజ్వేపై సౌదీ అరేబియా మరియు బహ్రెయిన్ని కలిపే పనులు 2021 మధ్యలో ప్రారంభమై, కేవలం మూడేళ్ళలో పూర్తవుతాయని బహ్రెయిన్లో సౌదీ అరేబియా రాయబారి చెప్పారు. ఆరు నెలల తర్వాత కింగ్ హమాద్ కాజ్వే టెండర్ జారీ చేయబడ్తుందని అబ్దుల్లా అల్ షేక్ చెప్పారు. కాజ్వేలో గల్ఫ్ కార్పొరేషన్ కౌన్సిల్ (జిసిసి) నెట్వర్క్కి సంబంధించి కార్గో ట్రైన్స్, వెహికిల్ లేన్స్కి వీలుగా రైల్ లైన్ కూడా ఏర్పాటు చేయబడుతుంది. ప్రాజెక్ట్ ఖరీదు 4 బిలియన్ డాలర్స్ వుంటుందని అంచనా వేశారు. ఇరు దేశాల మధ్యా ట్రేడ్ సహా పలు రంగాల్లో అభివృద్ధికి ఈ లింక్ దోహదపడ్తుందని అల్ షేక్ అభిప్రాయపడ్డారు. 25 కిలోమీటర్ల మేర ప్రస్తుతం వున్న కింగ్ ఫహాద్ కాజ్వేకి పేరలల్గా దీన్ని నిర్మించనున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక