ఇస్లాంకి అవమానం: బోన్ ఎక్కిన మహిళ
- September 18, 2018దుబాయ్లో ఓ హిళ, ఇస్లాంని అవమానించడంతో ఆమెపై కేసులు నమోదు చేశారు. దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్లో ఈ కేసు విచారణ జరిగింది. జనవరి 23న ఈ ఘటన జరిగింది. బుర్ దుబాయ్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు ఆమెపై కేసు నమోదయ్యింది. 31 ఏళ్ళ జోర్డానియన్ సౌండ్ టెక్నీషియన్పై అభియోగాలు మోపబడ్డాయి. పాలస్తీనియన్ క్లెర్క్ ఒకరు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు దారుడి సోదరిని ఇస్లాం పేరుతో నిందితుడు దూషించడమే కాక, ఆమెపై దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో అక్టోబర్ 14న న్యాయస్థానం తీర్పునివ్వనుంది. విచారణలో దోషిగా తేలితే 50,000 దిర్హామ్ల నుంచి 2 మిలియన్ దిర్హామ్ల వరకు జరీమానా, ఆరు నెలల నుంచి 10 ఏళ్ళ వరకు జైలు శిక్షను నిందితుడు ఎదుర్కోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు