గంగా నది ప్రక్షాళన ఉద్యమకారుడు అగర్వాల్ కన్నుమూత
- October 11, 2018గంగా నది ప్రక్షాళన కోసం నిరాహార దీక్ష చేసిన ప్రముఖ పర్యావరణ వేత్త జేడీ అగర్వాల్ (86) కన్నుమూశారు. 109 రోజులుగా దీక్ష చేస్తున్న ఆయనను ఇటీవల ఉత్తరాఖండ్ పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఆయనకు హఠాత్తుగా గుండె పోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడే ఆయన ప్రాణం విడిచారు. భారతీయులు పవిత్రంగా భావించే గంగా నదిని పరిశుభ్రపరచాలని 2008 నుంచి అగర్వాల్ నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఇటీవల చేసింది ఆరో దీక్ష. జేడీ అగర్వాల్ మృతిపై పలువురు ప్రముఖలు సంతాపం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు