సూయజ్ రాకెట్కు ప్రమాదం.. ఇద్దరు ఆస్ట్రోనాట్లకు తప్పిన ముప్పు
- October 11, 2018
న్యూయార్క్: ఇద్దరు ఆస్ట్రోనాట్లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్తున్న రష్యాకు చెందిన సూయజ్ రాకెట్ మధ్యలోనే చెడిపోవడంతో కజక్స్థాన్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు ఆస్ట్రోనాట్లు సురక్షితంగా బయటపడ్డారు. రష్యాకు చెందిన కాస్మోనాట్ అలెక్సీ ఓవ్చినిన్, అమెరికా ఆస్ట్రోనాట్ నిక్ హేగ్ ప్రమాదంలో జరిగిన సమయంలో అందులో ఉన్నారు. ప్రస్తుతం వాళ్లు ల్యాండైన ప్రదేశానికి రెస్క్యూ టీమ్స్ వెళ్తున్నాయి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్లడానికి బయలు దేరిన ఈ రాకెట్ బూస్టర్లో సమస్య తలెత్తింది. దీంతో ఆ ఇద్దరు సిబ్బంది బాలిస్టిక్ డీసెంట్ మోడ్లో తిరిగి భూమిపైకి వచ్చినట్లు నాసా ట్వీట్ చేసింది. సాధారణ ల్యాండింగ్ కంటే ఇది కాస్త వేగంగా జరిగే ల్యాండింగ్ అని నాసా వెల్లడించింది. సూయజ్ రాకెట్లో ఆరు గంటల పాటు ప్రయాణించి ఐఎస్ఎస్కు చేరాల్సి ఉంది. వీళ్లు ఆరు నెలల పాటు స్పేస్ స్టేషన్లో ఉండాల్సి ఉంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి