ధైర్యంగా మాట్లాడండీ:హీరో విశాల్
- October 16, 2018దేశవ్యాప్తంగా జరుగుతున్న ‘మీ టు’ ఉద్యమానికి నడిగర్ సంగం ప్రధాన కార్యదర్శి , హీరో విశాల్ మద్దతు పలికారు. లైంగిక వేధింపులపై తనుశ్రీ దత్తా, సింగర్ చిన్మయి ల ఆరోపణలను గౌరవిస్తూ ట్వీట్ చేశారు విశాల్.. ‘ఇదే కరెక్ట్ టైమ్. సినీ రంగంలో మహిళలు ధైర్యంగా మాట్లాడండీ. మీకు నేను అండగా ఉంటా. భద్రత కల్పించడానికి ఓ కమిటీగా ఏర్పడతాం. లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా బయట పెట్టిన చిన్మయి, తనుశ్రీదత్తా తదితరులను గౌరవిస్తున్నా’ అని విశాల్ ట్వీట్ చేశారు. కాగా గతంలో నటి శ్రీరెడ్డి కూడా క్యాస్టింగ్ కౌచ్ పై ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలుంటే బయటపెట్టాలని ఆమెకు సూచించాడు. కొన్ని రోజుల కిందట తన స్నేహితురాలు, నటి వరలక్ష్మి సైతం లైంగిక వేధింపులకు గురైనప్పుడు ఆమె ధైర్యంగా ముందుకు వచ్చి దీనిపై పోరాడిందని అప్పట్లో విశాల్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల