మహేశ్ మేనల్లుడి సినిమా 'అదేనువ్వు అదేనేను' ఆరంభం.!
- October 18, 2018అగ్ర కథానాయకుడు మహేశ్బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. గురువారం దసరా సందర్భంగా ఆయన మొదటి సినిమా షూటింగ్ను ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి సూపర్స్టార్ కృష్ణ క్లాప్ కొట్టారు. ఈ చిత్రానికి 'అదేనువ్వు అదేనేను' అనే టైటిల్ ఖరారు చేశారు. 'నన్ను దోచుకుందువటే' సినిమాతో గుర్తింపు పొందిన నభా నటేష్ ఈ చిత్రంలో కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు నిర్మిస్తున్నారు. సుధీర్బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం 'నన్ను దోచుకుందువటే'. ఈ సినిమాతో నభా నటేష్ నటిగా పరిచయం అయ్యారు. ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఇప్పుడు ఇది ఆమె రెండో చిత్రంగా రూపుదిద్దుకోనుంది.
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ