రేపటి నుంచి తెలంగాణ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
- November 11, 2018హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం విడుదల కానుంది. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 19 వరకు నామినేషన్ల దాఖలు చేసుకోవచ్చు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 22 వరకు ఉంది. కాగా, డిసెంబర్ 7న తెలంగాణలో ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యగా సీటీ పోలీసు కమిషనర్, అంజనీ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమైనప్పటినుంచి నామినేషన్ల ఉపసంహరణ వరకు ఆయా ప్రాంతాల్లో 100 మీటర్ల దూరంలో ఎక్కడా కూడా ఐదుగురు కంటే ఎక్కువ మంది కలిసి తిరగరాదని హెచ్చరించారు. ఎవరైనా ఆదేశాలను అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సీపీ హెచ్చరించారు. మరోవైపు అధికార పార్టీ టీఆర్ఎస్తో పాటు ప్రజాకూటమిలోని భాగస్వామ్య పక్షాలు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ