నటుడు ఉదయ్ కిరణ్పై పీడీ యాక్ట్ నమోదు
- November 11, 2018ఫుల్గా మందేసి, మరోసారి పోలీసులకు చిక్కాడు యువనటుడు, ఉదయ్ కిరణ్. గతంలో మాదాపూర్ దస్పల్లా హోటల్లో సిబ్బందితో గొడవ పెట్టుకుని, ఫర్నిచర్ ధ్వంసం చేసిన ఘటనలో ఒకసారి, మత్తు పదార్దాలు తీసుకున్న నేపథ్యంలో మరోసారి ఉదయ్ పోలీసులకు చిక్కాడు. ఈ మధ్య ఒక ఇంటి అద్దె విషయంలో దౌర్జన్యం చేసినందుకుగానూ ఇతడిపై కేసు నమోదైంది. నిన్న రాత్రి, తన ఫ్రెండ్ అను గుప్తాతో కలిసి, అర్ధరాత్రి వరకూ మందేసి, చిందేసిన ఉదయ్.. మాదాపూర్ పీఎస్ సర్కిల్ దగ్గర తన కారుతో నిఖిల్ అనే వ్యక్తి కారుని గుద్దాడు. మాటా మాటా పెరిగి, ఇద్దరూ పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడ మందేసిన మత్తులో, కానిస్టేబుల్ ముందే నిఖిల్ని కొడుతూ, ఆపబోయిన కానిస్టేబుల్ని కూడా తోసేసాడు. ఈలోగా ఖాళీగా ఉండి ఏం చెయ్యాలి అనుకుందో అతగాడి ఫ్రెండ్, కంప్యూటర్ బద్దలు కొట్టడమే కాకుండా, రికార్డులన్నిటినీ చించిపారేసిందట. వాళ్ళని దారిలోకి తెచ్చే సరికి పోలీసులకు తల ప్రాణం తోకకి వచ్చినంత పనైందట. గతంలో ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించిన ఉదయ్పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!