నటుడు ఉదయ్ కిరణ్పై పీడీ యాక్ట్ నమోదు
- November 11, 2018ఫుల్గా మందేసి, మరోసారి పోలీసులకు చిక్కాడు యువనటుడు, ఉదయ్ కిరణ్. గతంలో మాదాపూర్ దస్పల్లా హోటల్లో సిబ్బందితో గొడవ పెట్టుకుని, ఫర్నిచర్ ధ్వంసం చేసిన ఘటనలో ఒకసారి, మత్తు పదార్దాలు తీసుకున్న నేపథ్యంలో మరోసారి ఉదయ్ పోలీసులకు చిక్కాడు. ఈ మధ్య ఒక ఇంటి అద్దె విషయంలో దౌర్జన్యం చేసినందుకుగానూ ఇతడిపై కేసు నమోదైంది. నిన్న రాత్రి, తన ఫ్రెండ్ అను గుప్తాతో కలిసి, అర్ధరాత్రి వరకూ మందేసి, చిందేసిన ఉదయ్.. మాదాపూర్ పీఎస్ సర్కిల్ దగ్గర తన కారుతో నిఖిల్ అనే వ్యక్తి కారుని గుద్దాడు. మాటా మాటా పెరిగి, ఇద్దరూ పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడ మందేసిన మత్తులో, కానిస్టేబుల్ ముందే నిఖిల్ని కొడుతూ, ఆపబోయిన కానిస్టేబుల్ని కూడా తోసేసాడు. ఈలోగా ఖాళీగా ఉండి ఏం చెయ్యాలి అనుకుందో అతగాడి ఫ్రెండ్, కంప్యూటర్ బద్దలు కొట్టడమే కాకుండా, రికార్డులన్నిటినీ చించిపారేసిందట. వాళ్ళని దారిలోకి తెచ్చే సరికి పోలీసులకు తల ప్రాణం తోకకి వచ్చినంత పనైందట. గతంలో ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించిన ఉదయ్పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసారు.
తాజా వార్తలు
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు