పెళ్లికి ఇన్సూరెన్స్ చేయించిన దీపికా, రణ్వీర్
- November 15, 2018ఢిల్లీ : ఎవరైనా వారి జీవితాలకు, వాహనాలకు ఇన్సూరెన్స్ చేయిస్తారు..కానీ బాలీవుడ్ ప్రేమజంట రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె తమ వివాహానికి ఇన్సూరెన్స్ చేయించారు. ఢిల్లీకి చెందిన ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో వీరిద్దరూ తమ పెళ్లికి ఇన్సూరెన్స్ చేయించారట. 'దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ భవ్నానీ' పేరిట దీప్వీర్ వివాహానికి బీమా చేయించారు. దీనికి సంబంధించిన పత్రాలను కూడా వివాహం సందర్భంగా వీరికి అందించారు. వివాహంలో ప్రమాదవశాత్తూ ఆస్తి నష్టం, దొంగతనం, పేలుడు, అగ్ని ప్రమాదం, ఎయిర్ క్రాప్ట్ ప్రమాదం, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఈ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది' అని ఈ సంస్థ వెల్లడించింది. ఇటలీలోని లేక్ కోమోలో రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణెల వివాహం కొంకణి సంప్రదాయంలో అట్టహాసంగా జరిగింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పెళ్లి తంతు మధ్యాహ్నం 3 గంటలకు ముగిసినట్లు తెలుస్తోంది. అయితే వివాహ వేడుకలో సెల్ఫోన్లను నిషేధించారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!