మరో 25 ఏళ్లుల్లో మార్స్ మీదకు మనిషి..
- November 15, 2018
హూస్టన్: మార్స్ గ్రహం మీదకు మనుషులను పంపేందుకు నాసా అనేక ప్రయోగాలు నిర్వహిస్తున్నది. అయితే మరో 25 ఏండ్లల్లో అరుణ గ్రహంపై మనుషులు కాలు మోపే అవకాశాలు ఉన్నట్లు నాసా వెల్లడించింది. అత్యంత ప్రమాదకరమైన రేడియేషన్ నుంచి వ్యోమగాములకు రక్షణ కల్పించే టెక్నాలజీ అభివృద్ధిని చేయాల్సి ఉందని నాసా తెలిపింది. మార్స్ గ్రహం భూమి నుంచి 14 కోట్ల మైళ్ల దూరంలో ఉన్నది. అయితే చంద్రుడిపై అపోల్ వ్యోమనౌకను పంపినప్పుడు ఎన్ని ఇబ్బందులో ఎదురయ్యాయో అంత కన్నా ఎక్కువే ఇబ్బందులు ఉంటాయని నాసా పేర్కొన్నది. మార్స్ గ్రహం వెళ్లేందుకు కనీసం 9 నెలల ప్రయాణం ఉంటుందని, అయితే ఆ సమయంలో సౌర కాంతి నుంచి రేడియేషన్ ఉంటుందని, దానికి తగ్గట్లుగా షీల్డ్లను తయారు చేయాల్సి ఉంటుందని నాసా అభిప్రాయపడింది. బడ్జెట్ను దృష్టిలో పెట్టుకుని అంచనా వేస్తే, మార్స్ మిషన్ నిజం కావాలంటే కనీసం 25 ఏళ్ల సమయం పడుతుందని మాజీ ఆస్ట్రోనాట్ టామ్ జోన్స్ తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







