మరో 25 ఏళ్లుల్లో మార్స్ మీదకు మనిషి..
- November 15, 2018హూస్టన్: మార్స్ గ్రహం మీదకు మనుషులను పంపేందుకు నాసా అనేక ప్రయోగాలు నిర్వహిస్తున్నది. అయితే మరో 25 ఏండ్లల్లో అరుణ గ్రహంపై మనుషులు కాలు మోపే అవకాశాలు ఉన్నట్లు నాసా వెల్లడించింది. అత్యంత ప్రమాదకరమైన రేడియేషన్ నుంచి వ్యోమగాములకు రక్షణ కల్పించే టెక్నాలజీ అభివృద్ధిని చేయాల్సి ఉందని నాసా తెలిపింది. మార్స్ గ్రహం భూమి నుంచి 14 కోట్ల మైళ్ల దూరంలో ఉన్నది. అయితే చంద్రుడిపై అపోల్ వ్యోమనౌకను పంపినప్పుడు ఎన్ని ఇబ్బందులో ఎదురయ్యాయో అంత కన్నా ఎక్కువే ఇబ్బందులు ఉంటాయని నాసా పేర్కొన్నది. మార్స్ గ్రహం వెళ్లేందుకు కనీసం 9 నెలల ప్రయాణం ఉంటుందని, అయితే ఆ సమయంలో సౌర కాంతి నుంచి రేడియేషన్ ఉంటుందని, దానికి తగ్గట్లుగా షీల్డ్లను తయారు చేయాల్సి ఉంటుందని నాసా అభిప్రాయపడింది. బడ్జెట్ను దృష్టిలో పెట్టుకుని అంచనా వేస్తే, మార్స్ మిషన్ నిజం కావాలంటే కనీసం 25 ఏళ్ల సమయం పడుతుందని మాజీ ఆస్ట్రోనాట్ టామ్ జోన్స్ తెలిపారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ