పెళ్లికి ఇన్సూరెన్స్ చేయించిన దీపికా, రణ్వీర్
- November 15, 2018ఢిల్లీ : ఎవరైనా వారి జీవితాలకు, వాహనాలకు ఇన్సూరెన్స్ చేయిస్తారు..కానీ బాలీవుడ్ ప్రేమజంట రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె తమ వివాహానికి ఇన్సూరెన్స్ చేయించారు. ఢిల్లీకి చెందిన ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో వీరిద్దరూ తమ పెళ్లికి ఇన్సూరెన్స్ చేయించారట. 'దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ భవ్నానీ' పేరిట దీప్వీర్ వివాహానికి బీమా చేయించారు. దీనికి సంబంధించిన పత్రాలను కూడా వివాహం సందర్భంగా వీరికి అందించారు. వివాహంలో ప్రమాదవశాత్తూ ఆస్తి నష్టం, దొంగతనం, పేలుడు, అగ్ని ప్రమాదం, ఎయిర్ క్రాప్ట్ ప్రమాదం, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఈ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది' అని ఈ సంస్థ వెల్లడించింది. ఇటలీలోని లేక్ కోమోలో రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణెల వివాహం కొంకణి సంప్రదాయంలో అట్టహాసంగా జరిగింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పెళ్లి తంతు మధ్యాహ్నం 3 గంటలకు ముగిసినట్లు తెలుస్తోంది. అయితే వివాహ వేడుకలో సెల్ఫోన్లను నిషేధించారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష