తెలంగాణ:బీజేపీ నాలుగో జాబితా విడుదల
- November 17, 2018తెలంగాణలో ఎన్నికల నామినేషన్లకు గడువు ముంచుకొస్తుండటంతో కమలదళం వేగం పెంచింది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 7 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ బీజేపీ నాలుగో జాబితాను విడుదల చేసింది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శి జగత్ ప్రకాశ్ నడ్డా అభ్యర్ధుల జాబితా ప్రకటించారు. ఇప్పటికే 86 నియోజకవర్గాలకు కేండట్లను డిక్లేర్ చేసిన బీజేపీ అధిష్టానం తాజాగా ఏడు స్థానాలకు అభ్యర్థులను ఫిక్స్ చేసింది. మొదటి జాబితాలో 38 స్థానాలు, రెండో లిస్టులో మరో 28 మందికి అవకాశం కల్పించింది. మూడో జాబితాలో 20 స్థానాలకు టికెట్లు ఖరారు చేశారు. తాజా జాబితాలో పేరుంటుందని ఆశించిన కొందరి నేతల ఆశలు ఆవిరయ్యాయి.
చెన్నూరు నియోజకవర్గానికి – అందుగుల శ్రీనివాసులు,జహీరాబాద్- జంగం గోపి,గజ్వేల్- ఆకులవిజయ,జూబ్లీహిల్స్- శ్రీధర్రెడ్డి, నర్సంపేట్- ఎడ్ల అశోక్రెడ్డి,సనత్నగర్- భావర్లాల్ వర్మ, పాలకుర్తి- సోమయ్య గౌడ్కు బిజెపి టికెట్ కేటాయించింది
మరోవైపు తెలంగాణలో అమిత్ షా పర్యటన ఖరారైంది. ఈనెల 25, 27, 28 తేదీల్లో బీజేపీ చీఫ్ పర్యటించనున్నారు. మూడు రోజులపాటు 12 ఎన్నికల ప్రచార సభల్లో అమిత్షా పాల్గొంటారు. అదిలాబాద్, పెద్దపల్లి, పరకాల, మహేశ్వరం, కల్వకుర్తి, మహబూబానగర్, కొత్తగూడెం, సూర్యాపేట, చౌటుప్పల్, నిజామాబాద్, కామారెడ్డి, దుబ్బాక సభలో ప్రభుత్వ వైఫల్యాల్ని షా ఎండగట్టనున్నారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్