షార్జాలో 3 దిర్హామ్ల వరకు పెరిగిన బస్ ఛార్జీలు
- December 13, 2018షార్జా సిటీలో బస్ ప్రయాణీకులు ఇకపై 1 నుంచి 3 దిర్హామ్ల వరకు అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి వచ్చిన కొత్త టారిఫ్ ప్రయాణీకులకు కాస్త భారంగా మారింది. సిటీ మరియు ఇంటర్సిటీ బస్ రూట్స్లో ఛార్జీల్ని పెంచింది షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ. సిటీ రోడ్స్పై 7 దిర్హామ్లకు బదులుగా 8 దిర్హామ్లు చెల్లించాల్సి వస్తోంది. సాయెర్ కార్డ్స్పై ప్రయాణించేవారు 5.5 దిర్హామ్లకు బదులుగా 6 దిర్హామ్లు చెల్లించాలి. ఇంటర్సిటీ బస్ రూట్స్లో ప్రయాణించేవారికి మరింత అదనపు బాదుడు తప్పడంలేదు. షార్జా నుంచి అబుదాబీ లేదా అల్ అయిన్కి వెళ్ళేవారు 30 దిర్హామ్ల స్థానంలో 33 దిర్హామ్లు చెల్లించాలి. రస్ అల్ ఖైమాకు 25 దిర్హామ్లు గతంలో చెల్లిస్తే, ఇప్పుడు అది 27 దిర్హామ్లకు పెరిగింది. షార్జా నుంచి అజ్మన్కి 1 దిర్హామ్ పెరగగా, ఉమ్ అల్ కువైన్కి 2 దిర్హామ్లు పెరిగింది. ఛార్జీల పెరుగుదల భారంగా మారిందని ప్రయాణీకులుఅ ంటున్నారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!