షార్జాలో 3 దిర్హామ్‌ల వరకు పెరిగిన బస్‌ ఛార్జీలు

- December 13, 2018 , by Maagulf
షార్జాలో 3 దిర్హామ్‌ల వరకు పెరిగిన బస్‌ ఛార్జీలు

షార్జా సిటీలో బస్‌ ప్రయాణీకులు ఇకపై 1 నుంచి 3 దిర్హామ్‌ల వరకు అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. డిసెంబర్‌ 1 నుంచి అందుబాటులోకి వచ్చిన కొత్త టారిఫ్‌ ప్రయాణీకులకు కాస్త భారంగా మారింది. సిటీ మరియు ఇంటర్‌సిటీ బస్‌ రూట్స్‌లో ఛార్జీల్ని పెంచింది షార్జా రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ. సిటీ రోడ్స్‌పై 7 దిర్హామ్‌లకు బదులుగా 8 దిర్హామ్‌లు చెల్లించాల్సి వస్తోంది. సాయెర్‌ కార్డ్స్‌పై ప్రయాణించేవారు 5.5 దిర్హామ్‌లకు బదులుగా 6 దిర్హామ్‌లు చెల్లించాలి. ఇంటర్‌సిటీ బస్‌ రూట్స్‌లో ప్రయాణించేవారికి మరింత అదనపు బాదుడు తప్పడంలేదు. షార్జా నుంచి అబుదాబీ లేదా అల్‌ అయిన్‌కి వెళ్ళేవారు 30 దిర్హామ్‌ల స్థానంలో 33 దిర్హామ్‌లు చెల్లించాలి. రస్‌ అల్‌ ఖైమాకు 25 దిర్హామ్‌లు గతంలో చెల్లిస్తే, ఇప్పుడు అది 27 దిర్హామ్‌లకు పెరిగింది. షార్జా నుంచి అజ్మన్‌కి 1 దిర్హామ్‌ పెరగగా, ఉమ్‌ అల్‌ కువైన్‌కి 2 దిర్హామ్‌లు పెరిగింది. ఛార్జీల పెరుగుదల భారంగా మారిందని ప్రయాణీకులుఅ ంటున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com