డార్లింగ్ కి తెలంగాణ దెబ్బ
- December 18, 2018చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అనేది సినిమా డైలాగ్ మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా వర్తిస్తుందని ఋజువు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇటీవల కాలం నుంచి ఆక్రమణల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్న గవర్నమెంట్ కోర్ట్ ఆదేశాలు రావడం ఆలస్యం వెంటనే అమలులో పెట్టేస్తోంది. అందులో భాగంగా చేపట్టిన చర్యల్లో ప్రభాస్ ఆస్తి ఒకటి కృష్ణార్పణం అయిపోయింది.
వివరాల్లోకి వెళ్తే రాయదుర్గంలోని పైగా ప్రాంతం 83 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో విస్తరించి ఉంది. కమర్షియల్ గా ఆ ప్రాంతం కోట్ల డిమాండ్ లో ఉంది. దాని మీద ప్రైవేట్ వ్యక్తులు ఎవరికీ హక్కులు లేవంటూ అది మా సొత్తు అంటూ తెలంగాణా ప్రభుత్వం ఎప్పటినుంచో పోరాడుతోంది. ఆశించినట్టే తీర్పు అనుకూలంగా వచ్చింది. అవన్నీ ఆక్రమణలే తేల్చి వాటిని స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇచ్చేసింది.
అయితే అదే ఏరియాలో ప్రభాస్ కు ఒక ఖరీదైన గెస్ట్ హౌస్ ఉంది. షూటింగ్స్ లేని సమయంలో రిలాక్స్ అవ్వడానికి అన్ని వసతులతో ప్రభాస్ దీన్ని ప్రత్యేకంగా నిర్మించుకున్నాడు. ప్రభుత్వ అధికారులు చెకింగ్ కోసం వచ్చినప్పుడు సంబంధిత వ్యక్తులు ఎవరూ లేకపోవడంతో నోటీసును గేటుకు అతికింది ఇది ప్రభుత్వ ఆస్తి అంటూ పేర్కొంటూ సీజ్ చేసి వెళ్లిపోయారు.
ప్రభాస్ తరఫున నిర్ణీత గడువు లోపు స్పందించకపోతే దానికి పూర్తిగా స్వాధీనం చేసుకుని పడగొట్టే హక్కు సంక్రమిస్తుంది. కానీ లోపల ఉన్న ఇంటీరియర్స్, విలువైన వస్తువులకు నష్టం ఏర్పడవచ్చు. మరి ప్రభాస్ దీన్ని వదిలేస్తాడా ఇంకేమైనా ఆలోచిస్తాడా చూడాలి. ఆ గెస్ట్ హౌస్ ని సరెండర్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదని న్యాయ నిపుణుల సలహా. ఆక్రమించిన ఆస్తిని కొనుగోలు చేస్తే ఇలాంటి ఇబ్బందులు తప్పవు మరి. అవి సెలెబ్రిటీలకైనా అంతే.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!