ఐఎస్బి మెగా ఫెయిర్కి అద్భుత స్పందన
- December 18, 2018
ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ (ఐఎస్బి) మెగా ఫెయిర్ 2018కి ఔత్సాహికుల నుంచి అద్భుత స్పందన లభిస్తోందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇసా టౌన్లోని స్కూల్ క్యాంపస్లో ఈ మెగా ఫెయిర్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్లో ప్రధాన ఆకర్షణగా మ్యూజికల్ పెర్ఫామెన్స్లు నిలవనున్నాయి. ఇండియన్ ప్లే బ్యాక్ సింగర్ విదు ప్రతాప్, గాయత్రి, సంజిత్ సలామ్ ప్రదర్శనలు గురువారం, ప్రియాంక నేగి టీమ్ శుక్రవారం ప్రదర్శనలు ఇస్తారు. ఈ మెగా ఫెయిర్కి ఎంట్రీ ఫీజు 2 బహ్రెయినీ దినార్స్, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 1 గంటల వరకు ఈ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. టీచర్స్, స్టూడెంట్స్, పేరెంట్స్ అలాగే కమ్యూనిటీ మెంబర్స్ ఇండియన్ స్కూల్ మేనేజ్మెంట్తో కలిసి ఈవెంట్ని విజయవంతం చేయడానికి సంకల్పించారు. 300 మంది సభ్యులు గల ఆర్గనైజింగ్ కమిటీకి జనరల్ గవర్నర్ ఎస్ ఇనయదుల్లా నేతృత్వం వహిస్తున్నారు. స్పోర్ట్స్, టోర్నమెంట్స్, డాన్స్ అలాగే ఫొటోగ్రఫీ కాంటెస్ట్లు ఈ మెగా ఫెయిర్కి అనుబంధంగా కొనసాగిస్తున్నారు. సినిమాటిక్ డాన్స్, ఫోక్ డాన్స్ల్లోనూ పోటీలు నిర్వహిస్తున్నారు.బహ్రెయిన్లో అందరికీ ఈ పోటీల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. డిసెంబర్ 19 లోపు ఎంట్రీస్కి ఆహ్వానం వుంది. డిసెంబర్ 21న విజేతల్ని మెగా ఫెయిర్ ఫినాలెలో ప్రకటిస్తారు.
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







