రాణిని రాయబారం చేయమంటూ మేఘన్ తండ్రి అభ్యర్ధన
- December 18, 2018
లండన్: తన కూతురు మనసు మార్చి, ఆమెను తనకు దగ్గర చేయాలని బ్రిటన్ యువరాజు హ్యారీ సతీమణి మెఘన్ మార్కెల్ తండ్రి సోమవారం ఎలిజబెత్ రాణికి విన్నవించారు. హాలీవుడ్ నటి మెఘన్ యువరాజు హ్యారీని ఈ ఏడాది మేలో వివాహం చేసుకున్నారు. అయితే అప్పట్లో పెండ్లికి ఆమె తండ్రి థామస్ మారెత్కల్ హాజరుకాలేదు. పెండ్లయ్యి బ్రిటిష్ రాజకుటుంబంలోకి ప్రవేశించిన తర్వాత మేఘన్కు, తనకు మధ్య అగాథం ఏర్పడిందని థామస్ వాపోయారు. ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో థామస్ మాట్లాడుతూ.. కొన్ని నెలలుగా నేను ప్రతిరోజూ నా కూతురికి ఎన్నో మెసేజ్లు పంపుతున్నాను. వాటికి సమాధానం రావడం లేదు. నాకోసం క్రిస్మస్ కార్డులు పంపుతుందేమోనని ఎదురుచూసినా నిరాశే మిగిలింది. దయచేసిన నా కూతురిని నాకు తిరిగి దగ్గర చేయండి. త్వరలోనే మనవరాలో, మనవడో పుట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సంతోష తరుణంలో నేను ఆమెను కలవాలనుకుంటున్నాను. మహారాణిగా మీరు దయచేసి చొరవ తీసుకోండి అంటూ ఎలిజబెత్ రాణిని అభ్యర్థించారు.
దీనిపై స్పందించేందుకు ప్యాలెస్ వర్గాలు నిరాకరించాయి.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







