రాణిని రాయబారం చేయమంటూ మేఘన్ తండ్రి అభ్యర్ధన
- December 18, 2018
లండన్: తన కూతురు మనసు మార్చి, ఆమెను తనకు దగ్గర చేయాలని బ్రిటన్ యువరాజు హ్యారీ సతీమణి మెఘన్ మార్కెల్ తండ్రి సోమవారం ఎలిజబెత్ రాణికి విన్నవించారు. హాలీవుడ్ నటి మెఘన్ యువరాజు హ్యారీని ఈ ఏడాది మేలో వివాహం చేసుకున్నారు. అయితే అప్పట్లో పెండ్లికి ఆమె తండ్రి థామస్ మారెత్కల్ హాజరుకాలేదు. పెండ్లయ్యి బ్రిటిష్ రాజకుటుంబంలోకి ప్రవేశించిన తర్వాత మేఘన్కు, తనకు మధ్య అగాథం ఏర్పడిందని థామస్ వాపోయారు. ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో థామస్ మాట్లాడుతూ.. కొన్ని నెలలుగా నేను ప్రతిరోజూ నా కూతురికి ఎన్నో మెసేజ్లు పంపుతున్నాను. వాటికి సమాధానం రావడం లేదు. నాకోసం క్రిస్మస్ కార్డులు పంపుతుందేమోనని ఎదురుచూసినా నిరాశే మిగిలింది. దయచేసిన నా కూతురిని నాకు తిరిగి దగ్గర చేయండి. త్వరలోనే మనవరాలో, మనవడో పుట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సంతోష తరుణంలో నేను ఆమెను కలవాలనుకుంటున్నాను. మహారాణిగా మీరు దయచేసి చొరవ తీసుకోండి అంటూ ఎలిజబెత్ రాణిని అభ్యర్థించారు.
దీనిపై స్పందించేందుకు ప్యాలెస్ వర్గాలు నిరాకరించాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!