సినీ దిగ్గజాలపై ఐటీ దాడులు..జీర్ణించుకోలేని ఫ్యాన్స్
- January 03, 2019లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కర్ణాటకలో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి... ఇవాళ ఉదయం 6 గంటల నుంచి సినీ దిగ్గజాల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ నివాసంతో పాటు... ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య అయిన సినీనటి రాధిక నివాసంలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హీరో సుదీప్ నివాసంతో పాటు కన్నడ ఫిల్మ్ ఇండ్రస్ట్రీలోని దాదాపు 10 మంది సినీ దిగ్గజాలపై ఏకకాలంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. కన్నడ బిగ్ ప్రొడ్యూసర్ రాక్లైన్ వెంకటేష్ను కూడా వదలని ఐటీ అధికారులు... కేజీఎఫ్ ప్రొడ్యూసర్ విజయ్ సహా శివ్ రాజ్కుమార్, సీఆర్ మనోహర్ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా టాప్ హీరోను టార్గెట్ చేయడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్