గల్ఫ్ మరణాల గణాంకాలు...
- January 06, 2019ఢిల్లీ:గల్ఫ్ దేశాల్లో భారత కార్మికుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి రక్షణ కల్పించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైంది. 2014 నుంచి 2018 మధ్య గల్ఫ్ దేశాలైన బహ్రైన్, కువైట్, ఒమన్, కతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (యూఏఈ)లలో 28,523 మంది భారత కార్మికులు మృతి చెందారని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. పాటియాల ఎంపీ ధరమ్వీరా గాంధీ అడిగిన ప్రశ్నకు ఆ శాఖ సహాయ మంత్రి వికె సింగ్ సమాధానమిచ్చారు. ఆయా దేశాల్లోని భారత ఎంబసీల వద్ద ఉన్న లెక్కల ప్రకారం.. భారత కార్మికులు అధికంగా మృతి చెందిన గల్ఫ్ దేశాల్లో సౌదీఅరేబియా ఉంది. ఇక్కడ 2014-18 మధ్య 12,828 మంది కార్మికులు మృతి చెందారు. ఆ తర్వాతి స్థానంలో యూఏఈ(7,877 మంది) ఉన్నది.
తాజా వార్తలు
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం