నార్త్ కువైట్లో భూ ప్రకంపనలు
- January 07, 2019కువైట్ సిటీ: ఇరాన్ - ఇరాక్ బోర్డర్లో 5.9 మాగ్నిట్యూడ్ తీవ్రతతో సంభవించిన భూకంపం తాలూకు ప్రకంపనల ప్రభావం కువైట్ నార్త్ ప్రాంతంలోనూ కన్పించినట్లు కువైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ - నేషనల్ సెస్మలాజికల్ నెట్వర్క్ పేర్కొంది. డాక్టర్ అబ్దుల్లా అల్ ఎనెజి మాట్లాడుతూ, కువైట్లో సాయంత్రం 5.15 నిమిషాలకు ఈ ప్రకంపనల ప్రభావం కన్పించిందని అన్నారు. ఈ ప్రకంపనల కారణంగా ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఇరాన్ పశ్చిమ కెర్మాన్షా ్పఆవిన్స్లోని ఘలింఘార్బ్ ప్రాతంలో భూకంపం సంభవించింది. 10 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం సంభవించినట్లు టెహ్రాన్ యూనివర్సిటీ సెంటర్ పేర్కొంది. కాగా, 2017 నవంబర్లో సంభవించిన భూకంపం ఇరాన్లో 211 మంది ప్రాణాల్ని బలి తీసుకుంది.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్