కార్ పార్కింగ్ గొడవ: పొరుగింటి వ్యక్తిపై దాడి
- January 07, 2019
బహ్రెయినీ వ్యక్తి, పొరుగింటి వ్యక్తిపై దాడికి దిగిన కేసులో మూడు నెలల జైలు శిక్షకు గురయ్యాడు. నిందితుడికి 100 దిర్హామ్ల జరీమానా కూడా విధించింది న్యాయస్థానం. 2018 సెప్టెంబర్ 8న ఈ ఘటన జరిగింది. కారు పార్కింగ్ విషయమై జరిగిన గొడవ, ఈ దాడికి కారణమని విచారణలో తేలింది. నిందితుడు, బాధిత వ్యక్తిపైనా అతని కుమార్తెపైనా దాడికి దిగాడు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. వివాదానికి కారణమైన ప్రాంతానికి సంబంధించిన కేసు సివిల్ కోర్టులో వుంది.
తాజా వార్తలు
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం







