హైదరాబాద్ లో 13 నుంచి అంతర్జాతీయ పతంగుల పండుగ
- January 08, 2019ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ను ఈనెల 13వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. తెలంగాణ టూరిజం, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్ వివరాలను సోమవారం సచివాలయంలో వెల్లడించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 19 దేశాలకు చెందిన 42 సంస్థల ప్రతినిధులు, 60 మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. కైట్ ఫెస్టివల్తో పాటు ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తామన్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో 3 రోజులు జరిగే ఈ కార్యక్రమంలో.. వెయ్యి రకాల వంటకాలు ప్రదర్శిస్తామన్నారు. ఆగాఖాన్ అకాడమీతో సంయుక్తంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెంకటేశం తెలిపారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ