KGF దర్శకుడితో ప్రభాస్
- January 10, 2019ప్రభాస్లో భారీ సినిమాలు తీసేందుకు అనేక నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు. సాహో. ఈ ఏడాదిలో రానుంది. ఈ సినిమా బడ్జెట్ 150 కోట్లుగా తేల్చారు. మరో పిరియాడికల్ లవ్ స్టోరీ సినిమాలో కూడా నటిస్తున్నారు. దీనికి రాధాకృష్ణ దర్శకుడు. ఈ రెండు సినిమాలు ఈ ఏడాది చివర్లో పూర్తవుతాయి. ఆ తర్వాత ఆయన కమిట్మెంట్ ఏమిటనేది స్పష్టం కాలేదు.
బాహుబలి ప్రేరణలో కన్నడలో తీసిన కేజీఎఫ్ మంచి విజయం పొందింది. ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్కు మంచి పేరు వచ్చింది. పరిమిత వ్యయంతో సినిమాలు తీసే కన్నడ భాషలో ఇంత పెద్ద భారీ బడ్జెట్ చిత్రం తీసి విజయం సాధించడం మామూలు విషయం కాదు. అందుకే ప్రశాంత్తో సినిమా చేసేందుకు పలువురు స్టార్స్ ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది. తాజాగా ప్రశాంత్, ప్రభాస్ కలయికలో సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించే అవకాశం ఉందట. గతంలో దిల్ రాజు సంస్థలో మిస్టర్ పర్ఫెక్ట్ అనే సినిమాలో ప్రభాస్ నటించారు. మళ్లి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుందని సినీ వర్గాలు అంటున్నాయి.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు